సచివాలయం వద్ద ఉద్రిక్తత... పోలీసుల తోపులాటలో రాజధాని మహిళలకు గాయాలు

Mar 8, 2021, 12:31 PM IST

అమరావతి: వెలగపూడి సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేపడుతున్న నిరసనలో భాగంగా సచివాలయంలోకి వెళ్లేందుకు రాజధాని మహిళల ప్రయత్నించారు. అయితే బారికేడ్లను అడ్డుపెట్టి మహిళలను అడ్డగించారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడిపోయారు. దీంతో మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.  మందడంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తమ వాటర్‌ బాటిళ్లు పారబోస్తున్నారని ఆగ్రహించిన అమరావతి మహిళా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను వెళ్లిపొమ్మంటే పురుగుల మందు తాగి రైతులు చనిపోతామంటున్నారు. మహిళా రైతుల నుంచి పురుగుల మందు డబ్బాలను పోలీసులు లాక్కున్నారు.