అర్థరాత్రి వాగులో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు.. (వీడియో)

Oct 23, 2020, 2:58 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లి వద్ద వాగులో నీటి ప్రవాహ ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు ఇద్దరు గల్లంతయ్యారు. ఓ మహిళ, కారు డ్రైవర్ బయటపడ్డారు. వారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన ఈ కుటుంబం ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.