తెలుగు జాతికి దక్కిన అపూర్వ గౌరవమే ఈ ఆస్కార్..:ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి

Mar 13, 2023, 1:07 PM IST

అమరావతి :ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అచ్చతెలుగు సినిమా పాట 'నాటు నాటు'కు దక్కడం ఆనందదాయకమని ఏపీ సినిమాటోగ్రపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్, డైరెక్టర్ రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ఆర్ఆర్ఆర్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దారు... అందరూ కలిసి తెలుగు జాతికి అపూర్వ గౌరవాన్ని అదించారని అన్నారు. 
తెలుగు పాట ఆసార్క్ అవార్డు దక్కించుకోవడంతో తెలుగు ప్రజలు ఆనందంతో వున్నారన్నారు.ఈ పాట నిర్మాణం తెలుగు సినిమా రంగంలో చరిత్రలో నిలుస్తుందని... ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని మంత్రి చెల్లుబోయిన అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రపంచ స్థాయి సినిమాలు మరిన్ని రావాలన్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ దక్కడం భారత చలనచిత్ర రంగానికి మరింత పటిష్టత చేకూర్చుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.