తలపై టోపీ, భుజాన శాలువా, కోటుతో... అచ్చమైన ముస్లిం వేషంలో సీఎం జగన్

Mar 13, 2023, 5:11 PM IST

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముస్లిం సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి అంజాద్ బాషా నేతృత్వంలో వివిధ ముస్లీం సంఘాల పెద్దలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా తలపై టోపీ, ప్రత్యేక కోటు, భుజాన శాలువాతో అచ్చమైన ముస్లీం వేషధారణలో కనిపించారు జగన్.ముస్లీంల సమస్యల గురించి అన్ని సంఘాలను అడిగి తెలుసుకున్న సీఎం వాటి పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.