
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ నేతలపై వరుస దాడులు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.