వైఎస్ జగన్ : అమరావతిలో డబ్బులు పెడితే సముద్రంలో పోసినట్టే...

Feb 5, 2020, 3:30 PM IST

అమరావతి అభివృద్ధికి లక్షకోట్ల పైగానే కావాలి..అంత డబ్బు నా పరిధిలో లేదు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. నేను ఈ రాష్ట్రానికి తండ్రిలాంటివాడిని తండ్రి ఏం చేస్తాడు..పిల్లల మంచికోసం ఆలోచిస్తాడు. నేనూ అదే చేస్తున్నాను అన్నారాయన. అమరావతికి పెట్టే డబ్బుల్లో పదిశాతం పెట్టినా విశాఖపట్నం అద్బుతంగా అభివృద్ధి అవుతుందన్నారు. నా స్థానంలో మీరున్నా ఇదే పని చేస్తారని చెప్పుకొచ్చారు.