Feb 24, 2020, 4:20 PM IST
అమరావతి రాజధాని ధర్నాలో భాగంగా రైతులు , మహిళలు అమరావతిలోని అమరేశ్వరుని ఆలయం వద్దకి ర్యాలీగా వెళ్లారు . ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ నందిగం సురేష్ వాహనం తుళ్లూరుకి చెందిన రైతు తాడికొండ హనుమంతరావు కాలిపై ఎక్కడంతో రైతులు ఆందోళనకు దిగారు. తరువాత క్షతగాత్రుడిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక సమయంలో ఆగ్రహానికి గురైన రైతులు రాజధాని విషయంలో ఇంకెంత మందిని చంపుతారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు.