ఆటోను ఢీ కొట్టిన లారీ.. పదిమందికి గాయాలు...

Nov 16, 2020, 2:23 PM IST

విస్సన్నపేట మండలం చండ్రుపట్ల వాగు వద్ద రోడ్డు ప్రమాదం చండ్రుపట్ల వాగు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులోకి పడిపోయింది. ఈ సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.