కర్నూలులో పిడుగుపాటుకు 55 మేకలు మృతి...

May 30, 2020, 10:07 AM IST

కర్నూలు, బేతంచెర్ల మండల పరిధిలోని R.కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున పడిన పిడుగుకు 55 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. నిన్నటిదాక దంచికొట్టిన ఎండ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్మేసి ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ పిడుగుపాటులే మూగజీవాల ప్రాణాలను తీసింది.