డ్రగ్స్ ఓవర్ డోస్... యువకుడు మృతి

By telugu teamFirst Published May 11, 2019, 9:56 AM IST
Highlights

డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా... ఓ యువకుడు మృత్యువాత పడిన సంఘటన హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో చోటుచేసుకుంది. 

డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా... ఓ యువకుడు మృత్యువాత పడిన సంఘటన హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... రాజేంద్రనగర్‌లోని శివరంపల్లి గ్రామనికి చెందిన శివకుమార్ గత ఎనిమిది సంవత్సరాలుగా శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. 

కాగా శివకుమార్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు పండు(19) దిల్‌సుక్ నగర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలో మానివేసి తన తండ్రికి గల వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు.
 
గత కొంతకాలంగా.. గంజాయి ‌డ్రగ్స్ లాంటి అలవాట్లున్న పండు శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకోవడం వలన మృతి చెందాడు. పండు మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

పండు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదృహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!