హైద్రాబాద్‌లో పేలుడు: చెత్త సేకరించే మహిళ మృతి

Published : Feb 27, 2022, 10:06 AM ISTUpdated : Feb 27, 2022, 11:41 AM IST
హైద్రాబాద్‌లో పేలుడు:  చెత్త సేకరించే మహిళ మృతి

సారాంశం

 రాజేంద్రనగర్‌ మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలో ఆదివారం నాడు చెత్త సేకరిస్తున్న సమయంలో చోటు చేసుకొన్న పేలుడుతో ఓ మహిళ మరణించింది. ఈ పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Hyderabadరాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని Mailardevpally పారిశ్రామిక వాడలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకొంది. చెత్త సేకరిస్తున్న సమయంలో జరిగిన పేలుడుతో ఓ మహిళ మరణించింది.  మృతురాలిని సుశీలమ్మగా గుర్తించారు. 

ఇవాళ ఉదయం భార్యాభర్తలు చెత్త సేకరణకు వెళ్లారు. మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలో చెత్తను సేకరిస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో Wife  మరణించింది. భర్తకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  శంషాబా్ద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
Viral News: కింగ్‌ఫిష‌ర్ బీర్ బాటిల్‌లో చేప పిల్ల‌.. వార్త‌ల‌పై స్పందించిన కంపెనీ. ఏమన్నారంటే.?