మీకు నూకలు ఎప్పుడో చెల్లాయి: అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

Published : Aug 27, 2023, 08:06 PM IST
 మీకు నూకలు ఎప్పుడో  చెల్లాయి: అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

సారాంశం

ఖమ్మం సభలో  బీఆర్ఎస్ పై  అమిత్ షా విమర్శలకు మంత్రి హరీష్ రావు  కౌంటరిచ్చారు.

హైదరాబాద్: ఖమ్మం సభలో  బీఆర్ఎస్ పై  కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా చేసిన విమర్శలపై  మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు  నూకలు  చెల్లాయని  అమిత్ షా చేసిన విమర్శలను మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు.

also read:వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్: ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్

తమకు నూకలు చెల్లడం కాదు...తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు  తేల్చి చెప్పారు.బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసునని మంత్రి హరీష్ రావు  చెప్పారు. ఇలాంటి మీరా  కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

 

కార్పోరేట్  సంస్థల కోసం తీసుకు వచ్చిన  మూడు రైతు చట్టాలను నిరసిస్తూ  రైతులు ఆందోళన చేస్తే  బీజేపీ తోకముడిచిన విషయాన్ని హరీష్ రావు విమర్శలు చేశారు.కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని బీజేపీ సర్కార్ పై హరీష్ రావు  విమర్శలు చేశారు.సీఎం పదవి  కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని  బీజేపీకి హితవు పలికారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa