కాన్పూర్ సమీపంలో రైలులో గుండెపోటుతో మృతి

Published : Jun 16, 2017, 07:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కాన్పూర్ సమీపంలో రైలులో గుండెపోటుతో మృతి

సారాంశం

ఖమ్మం జిల్లాకు చెందిన మేడిపెల్లి రమేష్ అనే వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మరణించాడు. కాన్పూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రమేష్ మరణించిన బాధ ఒకవైపు అక్కడి భాష రాక మరోవైపు రమేష్ భార్య లీలావతి నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన మేడిపెల్లి రమేష్ అనే వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మరణించాడు.

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

 

రమేష్ మరణించిన విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది  కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

అయితే ఆయన మరణించాడని తెలియడంతో మృతదేహాన్ని ప్రస్తుతం కాన్పూర్ ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు.

 

రమేష్ మరణించిన బాధ ఒకవైపు అక్కడి భాష రాక మరోవైపు రమేష్ భార్య లీలావతి నానా ఇబ్బందులు పడుతున్నారు.

 

భార్యాభర్తలిద్దరూ గోరఖ్ పూర్ కు వెళ్తుండగా భర్తకు గుండెపోటు వచ్చి మరణించాడు. వారి కుటుంబసభ్యులు సాయం కోసం అర్థిస్తున్నారు.

 

లీలావతిని సంప్రదించాలంటే ఫోన్ నెం. 7095139915

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ
Telangana: తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ రోశ‌య్య స‌ల‌హాలిచ్చారు: మంత్రి వివేక్