తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో వెనుకబడిన తరగతులకు సబ్‌కోటా ఇవ్వాలి: కాంగ్రెస్‌

Mahesh Rajamoni | Published : Sep 24, 2023 4:56 PM

Women's Reservation Bill: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారు వెంట‌నే కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లులో వెనుకబడిన తరగతుల వర్గాలకు సబ్‌ కోటా కల్పించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ బీ.మహేష్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.   

TPCC working president B. Mahesh Kumar Goud: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లులో వెనుకబడిన తరగతుల వర్గాలకు సబ్‌ కోటా కల్పించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేష్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.  అలాగే, కుల గణన కూడా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకే బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నట్లయితే, వచ్చే ఎన్నికల నుంచి చట్టాన్ని అమలు చేయక తప్పదని కాంగ్రెస్‌ నేత అన్నారు.

బీసీ వర్గానికి సీట్లు కేటాయించే అంశాన్ని ఏఐసీసీ అధినేత సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లేవనెత్తారని మహేశ్ గౌడ్ అన్నారు.  కేంద్రంలోని 90 మంది కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే వెనుకబడిన తరగతులకు చెందినవారని రాహుల్ గాంధీ పార్లమెంటులో ఎత్తి చూపారని తెలిపారు. బీసీల‌కు తగిన ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

Read more Articles on
click me!