సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఖమ్మం సమీపంలో ఘటన..

Published : Feb 04, 2023, 12:50 PM ISTUpdated : Feb 04, 2023, 01:09 PM IST
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఖమ్మం సమీపంలో ఘటన..

సారాంశం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది.  శుక్రవారం సికింద్రాబాద్‌లో బయలుదేరిన వందే భారత్‌ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్‌ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చైర్ కార్ కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసం అయింది. దీంతో రైలు విశాఖపట్నం చేరుకన్న తర్వాత గ్లాస్‌ను  మార్చారు. 

అయితే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు విండో గ్లాస్ మార్చాల్సి రావడంతో.. శనివారం ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు 3 గంటలు ఆలస్యంగా 8:52 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరింది. దాడికి పాల్పడిన నిందితులని ట్రైన్‌ రెక్‌కు ఉన్న సీసీ కెమెరా ద్వారా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

ఇక, సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై గతంలో కూడా రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రారంభానికి ముందే విశాఖ కంచరపాలెంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్‌లో భాగంగా చెన్నై నుంచి రైలు విశాఖ వస్తుండగా రాళ్ల దాడి జరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్