తాళం వేసిన సమాధి పాకిస్తాన్‌లో కాదు.. హైదరాబాద్‌లోనే: వైరల్ ఫొటో Fact Check (Video)

Published : May 01, 2023, 01:10 PM IST
తాళం వేసిన సమాధి పాకిస్తాన్‌లో కాదు.. హైదరాబాద్‌లోనే: వైరల్ ఫొటో Fact Check (Video)

సారాంశం

పాకిస్తాన్‌లో తమ ఆడవాళ్ల సమాధులకు తాళాలు వేస్తున్నారనే ఓ కథనం తీవ్ర చర్చను రేపింది. అక్కడ శవాలను సమాధుల నుంచి తవ్వి తీసి రేప్ చేస్తున్నారని, పాకిస్తాన్ ఒక పర్వర్టెడ్ సొసైటీని తయారు చేస్తున్నదని ఆ కథనం వివరించింది. దీనికి సాక్ష్యంగా ఓ సమాధికి తాళం వేసిన ఫొటోనూ ప్రచురించారు. కానీ, ఫ్యాక్ట్ చెక్‌లో అసలు విషయం బయటపడింది. ఆ సమాధి పాకిస్తాన్‌లోనిది కాదని, హైదరాబాద్‌లో ఉన్నదని, ఆ కథనాలు చెబుతున్న భయానక పరిస్థితులేవీ లేవని స్పష్టమైంది.  

న్యూఢిల్లీ: ఇటీవలే ఓ వార్త తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పాకిస్తాన్‌లో లైంగిక కోరికలతో ఫ్రస్ట్రేటెడ్ అయినవారు ఉన్నారని, వారు సమాధుల నంచి మహిళల మృతదేహాలను బయటకు తీసి మరీ రేప్ చేస్తున్నారనేది ఆ వార్త సారాంశం. సమాధిపైన ఇనుప గ్రిల్స్ పెట్టి తాళం వేసినట్టు చూపిస్తున్న ఫొటో కూడా తెగ వైరల్ అయింది. ఈ ఫొటో ఆధారంగానే ఆ స్టోరీ ఉన్నది. ఈ ఫొటోలను ఫ్యాక్ట్ చేస్తే తాళం వేసి ఉన్న ఆ సమాధి పాకిస్తాన్‌లోనిది కాదని, అది హైదరాబాద్‌లోనిదని తేలింది. ఆ కథనం పూర్తిగా అవాస్తవం అని వెల్లడైంది.

పాకిస్తాన్ యాక్టివిస్ట్ హరిస్ సుల్తాన్ వ్యాఖ్యలను డైలీ టైమ్స్ కోట్ చేసి ఓ కథనం రాసింది. పాకిస్తాన్‌ ఒక సెక్సువల్లీ ఫ్రస్ట్రేటెడ్ సొసైటీని తయారు చేస్తున్నదని ఆ సమాధి ఫొటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆధారంగా డైలీ టైమ్స్ కథనం రాయగా.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కూడా స్టోరీ రాసింది. దీంతో మన దేశంలోని చాలా వార్తా సంస్థలు అదే నిజమని కథనాలు ప్రచురించాయి. కానీ, ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ఆ సమాధి ఫొటోను ట్వీట్ చేసి అది పాకిస్తాన్‌కు చెందినది కాదని, హైదరాబాద్‌లో ఆ సమాధి ఉన్నదని ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత హరిస్ సుల్తాన్ కూడా తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఏఎన్ఐ కూడా ఆ కథనం అవాస్తవం అని మరో స్టోరీ రాసింది.

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో మాదన్నపేట్‌లోని దరబ్‌గంజ్ కాలనీలో ఓ స్మశానం ఉన్నది. ఆ స్మశానంలోనే వైరల్ ఫొటోలోని సమాధి ఉన్నది. ఓ వ్యక్తి ఆ సమాధి గురించి వివరిస్తున్న వీడియో కూడా ట్వీట్ చేశారు.

Also Read: పాకిస్థాన్ లో తెరపైకి వింత ఘటన.. తమ కూతుర్లపై లైంగిక దాడి జరగకూడదని సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

ఆ సమాధి తమ పూర్వీకులదేనని ఆయన వివరించారు. ఇక్కడ స్మశానంలో పాత సమాధిలోనే కొందరు ఇప్పుడు తవ్వకాలు జరిపి కొత్తగా మళ్లీ మృతదేహాన్ని పూడ్చి పెడుతున్నారని, అందుకే తమ పూర్వీకుల అవశేషాలు భద్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమాధిని మరెవరూ తవ్వకుండా నివారించడానికే ఇనుప గ్రిల్ పెట్టి తాళం వేసినట్టు ఆయన తెలిపారు. అంతే తప్పా.. దీని వెనుక మరే విషయమూ లేదని స్పష్టం చేశారు.

కానీ, సోషల్ మీడియాలో ఈ సమాధి ఫొటోతో పాకిస్తాన్‌లో కొందరు శవాలను తవ్వి తీసి రేప్ చేస్తున్నారని, అందుకే సమాధులకు తాళాలు వేసుకుంటున్నారనే ఒక స్టోరీ వైరల్ అవుతున్నదని ప్రస్తావించగా.. అదంతా అవాస్తవం అని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu