ఏపీలో కుల రాజకీయం.. పోలవరం కట్టేది కేసీఆరే: మంత్రి మల్లారెడ్డి

Published : May 01, 2023, 12:55 PM IST
ఏపీలో కుల రాజకీయం.. పోలవరం కట్టేది కేసీఆరే:  మంత్రి మల్లారెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. నేడు కార్మిక దినోత్సవం  సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా  మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ కమ్మ, కాపు, రెడ్డి అంటూ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టేది.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది కేసీఆరేనని అన్నారు. 

సీఎం కేసీఆర్ పవర్ ఏమిటనేది అందరికీ  తెలుసునని అన్నారు. పక్క రాష్ట్రాల వాళ్లు కేసీఆర్ లాంటి సీఎం కావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నారనీ వారు తమ ఉసురు కొట్టుకుని పోతారని కామెంట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu