కేసీఆర్ ఆగ్రహం ఇదీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తలసాని

Published : Dec 06, 2019, 02:07 PM ISTUpdated : Dec 06, 2019, 03:43 PM IST
కేసీఆర్ ఆగ్రహం ఇదీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తలసాని

సారాంశం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు 

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ‌దేశానికి మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉందని  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

Also read:దిశ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్‌: నాడు సజ్జనార్‌, నేడు పోలీసులను ఎత్తుకొని డ్యాన్స్

శుక్రవారం నాడు చటాన్‌పల్లిలో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మీడియాతో మాట్లాడారు..నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య

కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువ అంచనా వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉగ్రరూపం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన చెప్పారు.  కేసీఆర్ సైతం జాతీయ నేతలు కూడ ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన  అభిప్రాయపడ్డారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

దిశ  ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి..ఇదే విషయాన్ని తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. 

 


 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?