నిమ్స్‌లో హైడ్రామా : మా డిమాండ్లు పరిష్కరిస్తేనే , ప్రభుత్వానికి ప్రీతి కుటుంబం అల్టీమేటం.. ఎర్రబెల్లి జోక్యం

Siva Kodati |  
Published : Feb 26, 2023, 10:53 PM IST
నిమ్స్‌లో హైడ్రామా : మా డిమాండ్లు పరిష్కరిస్తేనే , ప్రభుత్వానికి ప్రీతి కుటుంబం అల్టీమేటం.. ఎర్రబెల్లి జోక్యం

సారాంశం

హైదరాబాద్ నిమ్స్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే ప్రీతి మృతదేహం తరలింపుకు సహకరిస్తామని ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు వారితో చర్చలు జరిపారు.   

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే మృతదేహం తరలింపుకు సంబంధించి నిమ్స్‌లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రీతి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిమ్స్ ఐసీయూలో ప్రీతి బంధువులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఎలా చనిపోయిందన్న దానిపై కారణం చెప్పాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. తాము ఐసీయూలోకి రావాలంటే కారణం చెప్పాల్సిందేనని వైద్యులకు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు నోరు జారారు. లోపలికి రాకుంటే డెడీ బాడీని ప్యాక్ చేసి పంపాలా అంటూ వ్యాఖ్యానించారు. వైద్యుల వ్యాఖ్యలతో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోనకు దిగారు. 

ALso REad: ఎలా చనిపోయిందో కారణం చెప్పాల్సిందే : ప్రీతి తల్లిదండ్రుల పట్టు, నోరు జారిన వైద్యులు .. నిమ్స్‌లో ఉద్రిక్తత

హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేయకుండా విచారణ అంటే మోసం చేసినట్లేనని ప్రీతి తండ్రి వ్యాఖ్యానించారు. విద్యార్ధులను భయపెట్టి సమ్మె చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రీతి ఎలా చనిపోయిందో కేస్ షీట్ కావాలని, ప్రీతి మృతిపై కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ప్రీతి కుటుంబానికి మంత్రులు నచ్చజెప్ప ప్రయత్నం చేస్తున్నారు. వారు లేవనెత్తిన డిమాండ్లకు మంత్రులు అంగీకారం తెలిపారు. ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని.. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలన్న దానిపై ఆదేశాలు జారీ చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ప్రభుత్వపరంగా ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కాగా.. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

Also REad: విషాదం : ఫలించని వైద్యుల యత్నాలు.. డాక్టర్ ప్రీతి కన్నుమూత, మృత్యువుతో పోరాటంలో ఓటమి

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్