తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల కరపత్రం వెలుగు చూసింది. దీంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆ కరపత్రం అక్కడికి ఎలా వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని వెంకటాపురం మండలం, తిప్పాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ పోస్టర్ లభ్యమైంది.
జులై, ఆగస్టు మాసంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుందాం అంటూ ఆ కరపత్రంలో ఉంది. ఆ కరపత్రం మీద వర్షపు చినుకులు పడడంతో అక్షరాలు చెదిరిపోయి ఉన్నాయి. ఆ కరపత్రం ఎక్కడ ముద్రించారన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరపత్రం కలకలం రేగడంతో జిల్లా పోలీసులు అలర్టు అయ్యారు. జయశంకర్ జిల్లాకు సరిహద్దు జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.