డ్రగ్ మాఫియా ముఠాలు హైదరాబాద్ లో స్వైర విహారం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న పాఠశాలల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక రాకెట్ గుట్టును చేధించి పలువురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు తాజాగా మరో రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. స్టార్ హోటళ్లను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు రావడంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను ఐటిసి కాకతీయ హోటల్ వద్ద అరెస్టు చేశారు.
డ్రగ్ మాఫియా ముఠాలు హైదరాబాద్ లో స్వైర విహారం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న పాఠశాలల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక రాకెట్ గుట్టును చేధించి పలువురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు తాజాగా మరో రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. స్టార్ హోటళ్లను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు రావడంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను ఐటిసి కాకతీయ హోటల్ వద్ద అరెస్టు చేశారు.
ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ అజయ్ రావు చెప్పిన వివరాలు..
కొకైన్ ను సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశాం.
మహమ్మద్ జిషెన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ ఇతడు మెహెడిపట్నం వాసి గా గుర్తించాం.
టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు రావడంతో ముఠా ని ఐటీసీ కాకతీయ వద్ద అరెస్ట్ చేసి కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఎర్రల్డ్ విల్సన్ అలియాస్ నోవా ప్లాడ్ అనే నైజీరియాన్స్ ను అదుపులోకి తీసుకున్నాం.
అలీఖాన్ విచారణలో నైజీరియాన్ పేరు చెప్పాడు.
మొత్తం 17 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం.
మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతడి కోసం బృందాలు గాలిస్తున్నాయి.
అలీ ఖాన్ అత్తాపూర్ లో ఓ హోటల్ రన్ చేస్తున్నాడు.
పట్టు బడ్డ జిషెన్ అలీ ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా కొనసాగుతుండు.. కొంతమంది సింగర్ల తో కలిసి ఈవెంట్ చేసేవాడు.
స్టార్ హోటల్స్ ను టార్గెట్ గా ముఠా సప్లై చేస్తోంది.
కాల్ డేటా ఆధారంగా దార్యప్తు కొనసాగుతుంది త్వరలోనే మరి కొంత మందిని గుర్తిస్తాం..