హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆన్లైన్లో విటులను ఆకర్శిస్తూ విదేశీ యువతులతో ఖరీదైన హోటల్లో కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులు బట్టబయలు చేశారు.
హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆన్లైన్లో విటులను ఆకర్శిస్తూ విదేశీ యువతులతో ఖరీదైన హోటల్లో కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులు బట్టబయలు చేశారు.
ఉజ్బెకిస్థాన్కు చెందిన ఐదుగురు యువతులతోపాటు పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు యువతులు, నలుగురు విటులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3.50 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. పశ్చిమబెంగాల్, ఢిల్లీకి చెందిన రాహుల్, సూర్య.. లోకంటో అనే యాప్ను తయారుచేసి విటులను ఆకర్షిస్తున్నారు.
తమ వద్దకు వచ్చిన యువతుల ఫొటోలను యాప్లో సంప్రదించిన యువకులకు వాట్సాప్లో పంపించి ఆన్లైన్లోనే బేరం కుదుర్చుకుంటారు. వారి నుంచి రూ. 30 నుంచి 50 వేలు తీసుకొని రోజుకు ఒక్కో యువతికి రూ. 10 వేలు చెల్లించి ఖరీదైన హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఈ వ్యవహారం కొంతకాలంగా కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి అమీర్పేటలోని హోటల్ ఆదిత్య పార్క్, పంజాగుట్టలోని హోటల్ పోలోలో ఏకకాలంలో దాడి చేశారు. కాగా.. నిర్వాహకులు పరారీలో ఉన్నారు. యువతులను అదుపులోకి తీసుకున్నారు.