శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

Published : Apr 27, 2019, 04:06 PM IST
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

సారాంశం

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, గ్రామస్థులు శవంతో పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. 

యాదాద్రి: సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసుతో బొమ్మల రామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రావణి మృతదేహంతో హజీపూర్ గ్రామ ప్రజలు బొమ్మల రామారం పోలీసులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, గ్రామస్థులు శవంతో పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. 

శ్రావణి మృతదేహాన్ని బలవంతంగా హజీపూర్ తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను వచ్చే 24 గంటల్లో పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయినా ప్రజలు వినడంలేదు.

సంబంధిత వార్తలు

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?