కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం మరియు రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయ భూములను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో చట్టబద్ధంగా కేటాయించిన భూమిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నిస్తోందని, ఆలయాన్ని కూల్చకుండా కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ భక్తులతో కలిసి పోరాటం చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. దేవాలయ భూములపై అక్రమాల ఆరోపణలు, వాటర్ వర్క్స్ నిర్మాణం పేరుతో జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.