హజ్ యాత్ర 2023: తెలంగాణ నుంచి 3690 మంది యాత్రికుల ఎంపిక

Published : Apr 01, 2023, 01:59 PM IST
హజ్ యాత్ర 2023: తెలంగాణ నుంచి 3690 మంది యాత్రికుల ఎంపిక

సారాంశం

Hyderabad: హజ్ యాత్ర-2023కు సంబంధించి తెలంగాణ నుంచి 3690 మంది యాత్రికులు ఎంపికయ్యార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి మొత్తం 8659 దరఖాస్తులు వచ్చాయి. మక్కాను సందర్శించాలనుకునే యాత్రికులకు సమగ్ర ఆరోగ్య ఏర్పాట్ల కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది.  

Haj 2023: దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఎంపిక చేసేందుకు హజ్ కమిటీ శుక్రవారం న్యూఢిల్లీలో లాటరీ నిర్వహించింది. తెలంగాణ రిజర్వ్డ్ కేటగిరీల నుంచి జనరల్ కేటగిరీతో కలిపి 3,690 మందిని  లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 2023 హజ్ యాత్రకు రాష్ట్రానికి 3,743 మంది యాత్రికుల కోటాను కేటాయించారు. మక్కాను సందర్శించాలనుకునే యాత్రికులకు సమగ్ర ఆరోగ్య ఏర్పాట్ల కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది.

తెలంగాణ నుంచి 8659 దరఖాస్తులు రాగా, 8104 మంది యాత్రికులను లాటరీలో చేర్చినట్లు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. 70 ఏళ్ల వయసున్న రిజర్వ్డ్ కేటగిరీలో 479 మంది, మహ్రం లేని 76 మంది మహిళలను డ్రా లేకుండానే ఎంపిక చేశారు. ఈ ఏడాది 4,314 మంది భారతీయ మహిళలు 'మెహ్రామ్ (పురుష సహచరుడు)' లేకుండా హజ్ యాత్రను నిర్వహించబోతున్నారని, ఇది 2018 సంస్కరణ తరువాత చాలా ఎక్కువ‌ని అధికారులు తెలిపారు.రాష్ట్రాల్లో ముస్లిం జనాభాకు అనుగుణంగా హజ్ కోటా కేటాయిస్తారు. హైదరాబాద్ నుంచి 852 మంది యాత్రికులను ఎంపిక చేశారు. వీరిలో 70 ఏళ్లు పైబడిన వారిలో 278 మంది యాత్రికులు, 47 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీ నుంచి 527 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల నుంచి ఎంపికైన యాత్రికుల్లో ఆదిలాబాద్ 110, కొత్తగూడెం 26, హన్మకొండ 88, జగిత్యాల 72, జనగామ 20, భూపాలపల్లి 6, గద్వాల 135, కామారెడ్డి 87, కరీంనగర్ 105, ఆసిఫాబాద్ 48, మహబూబ్ నగర్ 137, మహబూబాబాద్ 16, మంచిర్యాల 44, నిర్మల్ 4, మెద‌క్ 49, మేడ్చల్ 283, వికారాబాద్ 67, వనపర్తి 43, వరంగల్ 100, భువనగిరి 23 మంది ఉన్నారు. అయితే, ములుగు, సిరిసిల్లలో ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఇక్క‌డి నుంచి ఒక్క ద‌ర‌ఖాస్తు కూడా రాలేదు. హజ్ యాత్రికుల ఆరోగ్యం కోసం విమానాశ్రయాల్లో హెల్త్ డెస్క్ లు, ప్రభుత్వ వైద్యులతో మెడికల్ స్క్రీనింగ్ తో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర ఏర్పాట్లు చేసింది.

ఖాదిమ్-ఉల్-హుజ్జాజ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

2023 హజ్ యాత్రకు ఖదీం-ఉల్-హుజ్జాజ్ ఎంపికకు భారత హజ్ కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 300 మంది యాత్రికులకు ఒక ఖదీమ్ ను ఎంపిక చేస్తారు. మహిళా ఖాదీమా కోసం కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని, అయితే ఇది రాష్ట్రాల్లో మహ్రామ్ లేని మహిళా యాత్రికుల దరఖాస్తులపై ఆధారపడి ఉంటుందని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ యాకూబ్ షేక్ తెలిపారు.

భారత యాత్రికుల ఏర్పాట్లలో జెడ్డా కాన్సులేట్ జనరల్ కు సహకరించాల్సిన బాధ్యత ఖదీమ్ ఉల్ హుజ్జాపై ఉంటుంది. ఖదీమ్-ఉల్-హుజ్జా గా ఎంపిక కావాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీక‌రిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu