గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్: ముషీరాబాద్‌ వైపు వెళ్లిన మహిళ, గాలింపు

By narsimha lodeFirst Published Aug 19, 2021, 10:16 AM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ ముషీరాబాద్ వైపు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 11న ఆమె ఆసుపత్రి ఆవరణలోనే తిరిగినట్టుగా గుర్తించారు. ముషీరాబాద్ సహా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈకేసును హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


హైదరాబాద్:  గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు ముషీరాబాద్ వైపు వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

also read:గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్‌లో కీలక సాక్ష్యం లభ్యం: సీసీటీవీల్లో మహిళ గుర్తింపు,కానీ....

గ్యాంగ్ రేప్  బాధితురాలు గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఒంటిపై సరైన దుస్తులు లేకుండానే తిరిగినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.  ఆసుపత్రి ఆవరణలో ఆమె తిరిగిన సమయంలో ఆమె నీరసంగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. ఆసుపత్రిలో తిరిగిన ఆమె చివరికి  ముషీరాబాద్ వైపు వెళ్లినట్టుగా పోలీసులు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు.

గాంధీ ఆసుపత్రి నుండి నడుచుకొంటూ ఆమె ముషీరాబాద్ వైపు వెళ్లినట్టుగా గుర్తించారు.  బాధితురాలి ఫోటోను పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు తరలించి గాలిస్తున్నారు. ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

click me!