వనస్థలిపురంలో సెక్స్ రాకెట్... ముంబై యువతిని ట్రాప్ చేసి...

By AN TeluguFirst Published Jun 21, 2021, 9:55 AM IST
Highlights

హైదరాబాద్: రాచకొండ పోలీసులు వనస్థాలిపురంలోని లాడ్జిపై దాడి చేసి ముంబైకి చెందిన ఒక మహిళను రక్షించారు. కస్టమర్‌తో సహా ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.


హైదరాబాద్: రాచకొండ పోలీసులు వనస్థాలిపురంలోని లాడ్జిపై దాడి చేసి ముంబైకి చెందిన ఒక మహిళను రక్షించారు. కస్టమర్‌తో సహా ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

పక్కా సమాచారంతో శనివారం పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ సమయంలో 
రిసెప్షన్ లో జె నాగ చంద్ర శేఖర్, బి గురయ్య, రామేశ్వర్ లు ఉన్నారు. లాడ్జిలోని ఓ స్పెషల్ రూంను తనిఖీ చేసినప్పుడు వారిలో అందులో ఓ జంట కనిపించారు. వారితో పాటు కస్టమర్ ఉన్నాడు. వ్యభిచారానికి ఆమెను ఒప్పించడం కనిపించింది. 

దర్యాప్తులో  శేఖర్, గురయ్య  లాడ్జ్ లో వ్యభిచారం నిర్వహించడానికి ఒక ప్రణాళికను రూపొందించారని, ఒక గదిని అందుకోసం కేటాయించేలా లాడ్జ్ యజమాని రమేశ్వర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులకు తెలిసింది. శేఖర్, గురయ్య ఒక శిల్పి బార్మాన్ ను సంప్రదించి, ఆమెను హ్యుమన్ ట్రాఫికింగ్ చేసినట్లు తెలిసింది.

గురయ్య, శేఖర్ లు ఇచ్చిన వాంగ్మూలం  ఆధారంగా పోలీసులు శిల్పిని పట్టుకున్నారు. "శేకర్, గురయ్య, శిల్పి, రామేశ్వర్, కస్టమర్లను అరెస్టు చేయగా, 26 ఏళ్ల బాధితురాలిని రక్షించారు. అయితే నిర్వాహకులు కస్టమర్ల నుంచి రూ. 2000 వేలు వసూలు చేస్తూ, భాదితురాలికి రూ.500 ఇవ్వడం ఇస్తున్నారని.. పోలీసులు తెలిపారు.

click me!