మరో తెలంగాణ రైతు ఆత్మహత్య

Published : May 28, 2018, 03:57 PM ISTUpdated : May 28, 2018, 04:02 PM IST
మరో తెలంగాణ రైతు ఆత్మహత్య

సారాంశం

జడ్చర్లలో విషాదం

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాల పేరుతో హడావిడి చేస్తుంటే మరోవైపు సర్కారు చర్యలు తమను ఆదుకునే పరిస్థితి లేదని అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా పాలమూరు జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం గంగాపూర్ లో మల్లయ్య (60) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుబంధు పథకం ద్వారా చేతికందిన రూ. 40 వేలు మాయం కావడంతో మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆత్మహత్యకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!
కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu