జగన్ . పవన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా రావు : మోత్కుపల్లి

First Published May 28, 2018, 2:56 PM IST
Highlights

జగన్  పవన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా  రావు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు . పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్టీఆర్‌ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఏపీలో పవన్, జగన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. 

click me!