
రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న ఎడ్లబండిని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నడుపుతున్న రైతు తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొల్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఛీ.. వీళ్లు అసలు తల్లిదండ్రులేనా ? రూ. 40 వేల కోసం.. 27 ఏళ్ల వ్యక్తికి 12 ఏళ్ల కూతురి విక్రయం
కుభీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన 40 ఏళ్ల దొడ్డికింది వెంగళరావ్ అనే రైతు నివసిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి ఓ వ్యక్తిని తన బైక్ పై ఎక్కించుకొని మాలేగాం గ్రామంలో విడిచిపెట్టాడు. తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే అదే సమయంలో వర్షం మొదలైంది. దీంతో ఆయనకు రోడ్డు సరిగా కనిపించలేదు.
ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించొద్దు - విద్యాశాఖ కీలక ఆదేశాలు
అయినప్పటికీ బైక్ ను నడుపుతూనే ఉన్నాడు. అలాగే అంతర్ని గ్రామ సమీపంలోకి చేరుకున్నాడు. అయితే ఆ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఓ ఎడ్లబండి నిలిపి ఉంచిన విషయం ఆయనకు తెలియలేదు. నేరుగా వెళ్లి ఆ ఎడ్లబండిని ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.
బక్రీద్ రోజున జంతువులను అక్రమంగా వధించొద్దు - బాంబే హైకోర్టు
వెంటనే స్థానికులు వెంగళరావ్ ను భైంసా ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు నితిన్ ఉన్నారు. నితిన్ అమెరికాలో నివసిస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు అంత్యక్రియలు జపకూడదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.