
మరికొద్దినెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూకడుతున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఖరారైంది. జూలై 8న ఆయన తెలంగాణకు రానున్నారు. ఆ రోజున ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్కు, వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.