Feb 15, 2019, 3:23 PM IST
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 6 నాడు విలేఖరుల మంటూ రైస్ మిల్లుళలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురిని మిర్యాలగుడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ముగ్గురు ముఠాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విలేకర్లుమంటూ వ్యాపార వర్గాల వారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఖమ్మం, నకిరేకల్ వంటి పలు ప్రాంతాల్లో వారు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.