200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

By sivanagaprasad kodatiFirst Published Nov 12, 2018, 1:01 PM IST
Highlights

టీమిండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల క్లబ్‌లోకి రోహిత్ చేరాడు. 

టీమిండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల క్లబ్‌లోకి రోహిత్ చేరాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో చెన్నైలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఫోర్ కొట్టిన రోహిత్ .. దీని ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

భారత్ తరపున రోహిత్ శర్మ కంటే ముందు 214 ఫోర్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అంతర్జాతీయంగా చూస్తే...టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ 223 ఫోర్లతో ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్గానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. వీరి వెనుక కోహ్లీ, మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మ ఉన్నారు. 

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అడిగి మరీ తీసుకున్నాడు: కృనాల్ పాండ్యపై రోహిత్ శర్మ

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

టెస్టు జట్టులో దక్కని చోటు: రోహిత్ శర్మ ఉద్వేగభరిత ట్వీట్

నేను ఆ స్థితిలో లేను: జట్టులో చోటుపై రోహిత్ శర్మ

ఇంటికే: రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు

ఆ ‘‘చెత్త రికార్డ్’’ రోహిత్ శర్మదే

click me!