బ్రేకింగ్ న్యూస్ : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం, ఓ యువతి మృతి

First Published Nov 15, 2017, 1:40 PM IST
Highlights
  • బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం
  • సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి

 హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పెన్షన్ హౌస్ వద్ద రోడ్డు దాటుతున్న శిరీష అనే యువతిని ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ప్రమాద స్థలంలోనే యృతి చెందింది.
మృతురాలు శిరీష సాప్ట్ వేర్ ఉద్యోగి. బంజారాహిల్స్ లోని స్పిన్ సై సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఆపీసుకు వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మీతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 

click me!