అమ్మాయిలే నాపై అత్యాచారం చేశారు.... యువకుడి ఆవేదన...!

By telugu news teamFirst Published Nov 24, 2022, 9:45 AM IST
Highlights

తనను నలుగురు అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేశారంటూ ఫిర్యాదు చేశాడు.  కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు.... తనపై మత్తు మందు చల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ అతను ఆరోపించడం గమనార్హం.

దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ చాలా దారుణాలు చోటుచేసుుకుంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలపై ప్రతిరోజూ ఘోరాలు జరుగుతున్నాయి. ఒంటరిగా ఆడపిల్ల కినిపిస్తే చాలు... ఇంటికి క్షేమగా వస్తుందా లేదా అనే భయం ఉంటోంది. అయితే... తాజాగా ఓ పురుషుడిపై అత్యాచారం జరిగింది. నలుగురు అమ్మాయిలు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ యువకుడు ఆరోపించడం గమనార్హం. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్ లోని జలంధర్ కు చెందిన ఓ వ్యక్తి... తనను నలుగురు అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేశారంటూ ఫిర్యాదు చేశాడు.  కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు.... తనపై మత్తు మందు చల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ అతను ఆరోపించడం గమనార్హం.

వాళ్లంతా గొప్పింటికి చెందిన అమ్మాయిల్లా ఉన్నారని... ఇంగ్లీష్ లో మాబట్లారని అతను చెప్పడం గమనార్హం.తనను అపస్మారక స్థితికి తీసుకువెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని అతను ఆరోపించడం గమనార్హం. దీంతో... ఈ కేసును పోలీసులు కూడా సుమోటోగా తీసుకోవడం గమనార్హం.

బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.... సదరు వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ  జీవించేవాడు.  సోమవారం తన పని పూర్తి చేసుకొని బస్సు కోసం ఎదురు చూస్తుండగా...ఓ తెల్ల కారు వచ్చి అక్కడ ఆగింది. అడ్రస్ చెప్పాలంటూ పిలిచి.. ముఖంపై మత్తు మందు  చల్లి... స్పృహ తప్పిన తర్వాత కారులో ఎక్కించుకొనివెళ్లి దారుణానికి పాల్పాడ్డారు. అనంతరం తనని తీసుకువెళ్లి రోడ్డుపై పడేసి వెళ్లారని అతను చెప్పడం గమనార్హం. ముందుగా.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పరువు పోతుందని చెప్పలదేని... తన భార్య బలవంతం మీద.. ఇప్పుడు మీడియా ముందు చెబుతున్నట్లు చెప్పాడు. అతను చెప్పిన దానిని పోలీసులు సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!