పీకల దాకా తాగిన ఐదుగురి కీచకపర్వం: పొదల్లోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్

By telugu teamFirst Published Aug 17, 2021, 8:36 AM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో దారుణమైన సంఘటన జరిగింది. పీకల దాకా తాగిన ఐదుగురు వ్యక్తులు ఓ మహిళను పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దుండగులు అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో 60 ఏళ్ల మహిళపై ఐదుగురు సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు. 

మహిళ తన ఇంటికి వెళ్తుండగా సింగ్రౌలీలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం తాగిన వారికి మహిళ కనిపించగానే కళ్లు మూసుకుపోయాయి. ఆమెను పొదల్లోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. 

ఆ తర్వాత వారు పారిపోయారు. మహిళ సమీపంలోని పోలీసు స్టేషన్ కు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది. మహిళ తమకు ఫిర్యాదు చేయగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు వారిని విచారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో మహిళా రోగిపై వార్డు బాయ్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

click me!