మాస్కు ధరించలేదని ఎత్తుకెళ్లి మహిళపై పోలీసు రేప్: నగ్నంగా ఫొటోలు తీసి...

By telugu teamFirst Published Jun 17, 2021, 7:23 AM IST
Highlights

గుజరాత్ లోని సూరత్ లో ఓ మహిళ కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేసింది. తనను ఎత్తుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కానిస్టేబుల్ భార్య ఆమెపై ఫిర్యాదు చేసింది.

సూరత్: మాస్క్ ధరించలేదని ఆరోపిస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన సంఘటన గుజరాత్ లోని సూరత్ లో వెలుగు చూసింది. ఆ సంఘటన నిరుడు జరిగింది. అయితే, ఆలస్యంగా వెలుగు చూసింది. 

2020 లాక్ డౌన్ సమయంలో 33 ఏళ్ల మహిళ పాల్సానాలో పాల కోసం బయటకు వచ్చింది. అయితే ఆమె మాస్కు ధరించలేదు. ఆ విషయం గమనించిని నరేష్ కపాడియా అనే కానిస్టేబుల్ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను బెదిరించి అక్కడి నుంచి అపహరించాడు. పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్తానని చెప్పి ఆ వివాహితను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. 

ఆమెను వివస్త్రను చేసి ఆమెపై చేయి చేసుకున్నాడు. నిందితుడు సూరత్ లోని ఉమర్ పాడ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడు. మహిళ ఫోటోలు తీసుకుని వాటిని బయటపెడుతానని బ్లాక్ మెయిల్ చేసి కొన్ని నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ సంఘటనపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తన భర్తతో కలిసి మహిళ తన ఇంటికి వచ్చి కానిస్టేబుల్ భార్య కూడా ఫిర్యాదు చేసింది. ఇరువైపులా పరస్పరం కేసు నమోదు చేసుకోవడం అయోమయాన్ని సృష్టిస్తోంది. నిందితుడైన పోలీసు కానిస్టేబుల్ కు మహిళతో అఫైర్ ఉన్నట్లు తెలుస్తోందని, దర్యాప్తు చేస్తున్నామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు. 

click me!