గోసేవతో యోగి డే ప్రారంభం

Published : Nov 11, 2025, 09:29 PM IST
 yogi adityanath

సారాంశం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బలరాంపూర్‌లోని మా పటేశ్వరి శక్తిపీఠంలో పూజలు చేసి, గోశాలలో ఆవులకు సేవ చేశారు. సీఎం రెండ్రోజుల పర్యటన భక్తి, సేవలతో నిండిపోయింది.

Uttar Pradesh : ఇవాళ (మంగళవారం) ఉదయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదిశక్తి మా పటేశ్వరి శక్తిపీఠానికి చేరుకుని భక్తితో తలవంచి నమస్కరించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసి, ఆ తర్వాత గోశాలకు వెళ్లి ఆవులకు సేవ చేశారు.

రెండు రోజుల బలరాంపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రెండు రోజుల పర్యటన కోసం బలరాంపూర్‌కు వెళ్ళారు. ఇక్కడ బ్రహ్మలీన మహంత్ యోగి మహేంద్రనాథ్ జీ మహారాజ్ 25వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆరాధనతో ఆయన రెండో రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఆలయ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలన

పూజల అనంతరం ముఖ్యమంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇక్కడి ఏర్పాట్లు, పరిశుభ్రత, భక్తుల కోసం చేసిన సౌకర్యాలను సమీక్షించారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ సిబ్బందికి సూచించారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి గోశాలకు చేరుకుని, అక్కడ ఆవులకు పచ్చిగడ్డి, బెల్లం తినిపించారు. గోసేవ భారతీయ సంస్కృతికి ఆత్మ లాంటిదని, "ఆవు మన సంప్రదాయం, ఆర్థిక వ్యవస్థ, విశ్వాసం మూడింటికీ ప్రతీక" అని అన్నారు. గోశాలలోని ఏర్పాట్లను ప్రశంసించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు.

ప్రజాప్రతినిధులు, స్థానికులతో భేటీ

ఆలయ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, పౌరులతో సమావేశమయ్యారు. వారి నుంచి ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free Gas Cylinder: దీపావళికి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం
Success Story : పశువుల పేడతో లక్షల సంపాదన.. అద్భుతాలు చేస్తున్న ఆడబిడ్డ