యూనిఫామ్ సివిల్ కోడ్: శాంతిభద్రతలకు విఘాతం క‌లిగించేందుకు.. ప్ర‌ధాని మోడీపై ఏంకే స్టాలిన్ ఫైర్

Published : Jun 29, 2023, 04:15 PM IST
యూనిఫామ్ సివిల్ కోడ్: శాంతిభద్రతలకు విఘాతం క‌లిగించేందుకు.. ప్ర‌ధాని మోడీపై ఏంకే స్టాలిన్ ఫైర్

సారాంశం

Chennai: ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడంపై డీఎంకే అధ్యక్షుడు, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. యూసీసీపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించేందుకు, మతపరమైన హింసకు కారణమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండకూడదని మన మోడీ అంటున్నారని అన్నారు.  

Tamil Nadu CM M K Stalin slams PM Modi: త‌మిళ‌నాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. యూసీసీపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించేందుకు, మతపరమైన హింసకు కారణమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండకూడదని మన మోడీ అంటున్నారని అన్నారు.  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపునిచ్చిన పాట్నా ప్రతిపక్ష సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని, అందుకే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాబోయే 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో ఉండటానికి మతపరమైన సమస్యలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని స్టాలిన్ గురువారం ఆరోపించారు.

చెన్నైలో జరిగిన పార్టీ సభ్యుడి కుటుంబ సభ్యుల వివాహానికి హాజరైన స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లౌకిక పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మణిపూర్ పరిస్థితిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్ర‌స్తావిస్తూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దాదాపు 115 మంది మరణించడం, 40,000 మందికి పైగా నిరాశ్రయులైన హింసను ఎత్తిచూపిన స్టాలిన్, ఈశాన్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అధికార బీజేపీ వ్యవహరించిన తీరును విమర్శించారు. 50 రోజులుగా మణిపూర్ దగ్ధమవుతోందనీ, కానీ ప్రధానికి ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి ఇంకా సమయం లభించలేదంటూ విమ‌ర్శించారు. 50 రోజుల హింసాకాండ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తున్నాయ‌ని విమర్శించారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తొలి బహిరంగ సభలో ప్రధాని మోడీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని తీసుకురావడాన్ని ఆయన ఖండించారు. మంగళవారం భోపాల్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోందని, యూసీసీ కోసం గట్టిగా గళమెత్తారు. ట్రిపుల్ తలాక్, పస్మాండా ముస్లింలపై వివక్ష, పాట్నాలో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం గురించి ప్రస్తావించారు. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం గురించి చెబుతున్నప్పుడు భారతదేశం రెండు ర‌కాల‌ చట్టాలతో నడవజాలదని ప్రధాని మోడీ మంగళవారం అన్నారు. ఇదే విష‌యం గురించి స్టాలిన్ మాట్లాడుతూ.. యూసీసీని అమలు చేస్తామని, దేశంలో రెండు వేర్వేరు చట్టాలు ఉండబోవని మోడీ చెప్పారన్నారు. ''దేశంలో మతపరమైన అంశాలను లేవనెత్తడం, గందరగోళం సృష్టించడం ద్వారా తాను మళ్లీ గెలవగలనని ఆయన భావిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని' స్టాలిన్ అన్నారు. 

తమిళనాడులో ప్రభుత్వం ద్రవిడ నమూనాతో పనిచేస్తోందని ఆయన అన్నారు. 2021 మేలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి, డీఎంకె తమ ఎన్నికల వాగ్దానాలను స్థిరంగా నెరవేర్చింది. ఇది కొనసాగాలంటే, లౌకికవాద, మనకు మద్దతిచ్చే, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడే ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకురావడానికి సిద్ధంగా, నిర్ణయాత్మకంగా ఉండాలని తాను తమిళనాడు ప్రజలను కోరుతున్నాన‌ని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌