అగ్నిపథ్ ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ చెల్లుతుందని, ఏకపక్షం కాదన్న ధర్మాసనం

Published : Apr 10, 2023, 03:49 PM IST
అగ్నిపథ్ ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ చెల్లుతుందని, ఏకపక్షం కాదన్న ధర్మాసనం

సారాంశం

త్రివిధ దళాల్లో నియామాకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పు ఇచ్చిందని పేర్కొంది. 

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్నిపథ్ పథకాన్ని సమర్థించింది. ఈ పథకం ఏకపక్షం కాదని కూడా కోర్టు పేర్కొంది. అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించే ముందు శారీరక, వైద్య పరీక్షలతో సహా వివిధ రిక్రూట్‌మెంట్ విధానాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రక్షణ దళాలలో నియామకమయ్యే హక్కు లేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

భారత్ లో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? 3 కారణాలు చెప్పిన ఐఎంఏ.. అవేంటంటే ?

‘‘క్షమించండి.. మేము హైకోర్టు నిర్ణయంతో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. దీంతో పాటు హైకోర్టు తీర్పుపై దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్లను గోపాల్ కృష్ణ, న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేశారు.

దేశంలో మూడో ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.218.112 కోట్ల ఆదాయం - ఏడీఆర్ నివేదిక

అయితే అగ్నిపథ్ పథకం ప్రారంభానికి ముందు భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో నియామకాలకు సంబంధించి దాఖలైన మూడో పిటిషన్ ను ధర్మాసనం ఏప్రిల్ 17న విచారణకు వాయిదా వేసింది. ఐఏఎఫ్ లో రిక్రూట్ మెంట్ కు సంబంధించిన మూడో పిటిషన్ పై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని కోరింది. సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం పథకాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు మార్చి 27న సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

నమాజ్ చేస్తున్న వారిపై దుండగుల దాడి.. మసీదును ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత.. ఎక్కడంటే ?

సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు మార్చి 27న సుప్రీంకోర్టు అంగీకరించింది. జాతీయ భద్రతను కాపాడే ప్రశంసనీయమైన లక్ష్యంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా అగ్నిపథ్ పథకాన్ని రూపొందించామని ఫిబ్రవరి 27న హైకోర్టు పేర్కొంది.

ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..

జూన్ 14న ఆవిష్కరించిన అగ్నిపథ్ పథకం సాయుధ దళాల్లో యువత నియామకానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. ఈ పథకం కింద 17 నుంచి 21 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, వారిని నాలుగేళ్ల కాలపరిమితికి చేర్చుకుంటామని తెలిపింది. వీరిలో 25 శాతం మందికి రెగ్యులర్ సర్వీసును మంజూరు చేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలపడంతో పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 2022లో ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు ప్రభుత్వం పొడిగించింది. ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను 2022 జూలై 19న సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

PREV
click me!

Recommended Stories

NASA Creates History Again!: సవాళ్ల నుంచి సక్సెక్ వరకు..భూమిపైకి సేఫ్‍గా వీరులు| Asianet News Telugu
ఆంధ్రాఅల్లుడికి PAKలో గ్రాండ్‌ వెల్కమ్‌ | JD Vance Meets PAK PM Shehbaz Sharif | Asianet News Telugu