Pahalgam Terror Attack: భారత్‌తో ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌కు చైనా మద్దతు.. బుద్ది మారని డ్రాగన్

Published : Apr 27, 2025, 05:57 PM ISTUpdated : Apr 27, 2025, 06:04 PM IST
Pahalgam Terror Attack:  భారత్‌తో ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌కు చైనా మద్దతు.. బుద్ది మారని డ్రాగన్

సారాంశం

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఎంటరైంది. మరోసారి తమ వక్రబుద్దిని చూపిస్తూ చైనా-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. ఈ పరిణామం ప్రాంతీయ దౌత్యంపై, భారత్ వ్యూహాలపై ప్రభావం చూపుతుంది.

Pahalgam massacre: చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. ఉగ్రవాదులకు పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే చర్యలకు ఉపక్రమిస్తోంది.  పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి సెనేటర్ మహమ్మద్ ఇషాక్ దార్ ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి గురించి దార్, వాంగ్ యికి వివరించారు.

 

 

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ X పోస్ట్ ప్రకారం ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి గురించి దార్, వాంగ్ యికి వివరించారు. భారత్ ‘ఏకపక్ష చర్యలు, ఆరోపణలను ఖండించారు. చైనా ‘మద్దతు’కు దార్ కృతజ్ఞతలు తెలిపారు. బలమైన బంధం పట్ల పాకిస్తాన్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘ఏకపక్ష’, ‘ఆధిపత్య’ విధానాలను వ్యతిరేకిస్తామని ఇరు దేశాలు పేర్కొన్నాయి.

చైనా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు దగ్గరి వ్యూహాత్మక భాగస్వామి. కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలపై బీజింగ్ ఇస్లామాబాద్‌కు దౌత్యపరంగా మద్దతు ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌కు అతిపెద్ద రక్షణ సరఫరాదారు, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా కీలక పెట్టుబడిదారు.

పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు దిగజారాయి. ఈ దాడిలో 26 మంది మరణించారు. పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని భారత్ ఆరోపించింది. దీన్ని పాక్ ఖండించింది. భారత్ దౌత్య, భద్రతా చర్యలు తీసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా ప్రోటోకాల్స్, సింధు జలాల ఒప్పందం రద్దు, వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం, పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేయడం, దౌత్య సంబంధాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడిపై ‘తటస్థ, విశ్వసనీయ’ దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న చరిత్రను ఉటంకిస్తూ భారత్ దీన్ని తిరస్కరించింది.

చైనా, పాకిస్తాన్ దగ్గరైన దౌత్య సమన్వయం, ఉగ్రవాదంపై ఇస్లామాబాద్‌ను దౌత్యపరంగా ఒంటరి చేయాలనే భారత్ ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రపంచ వేదికలపై చైనా ప్రభావంతో, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే భారత చర్యలను ఎదుర్కోవడం పాకిస్తాన్‌కు సులభం అవుతుంది. అదే సమయంలో శాంతి, ‘పరస్పర గౌరవం’ కోసం బీజింగ్ పిలుపు, చైనా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని సూచిస్తుంది. ఈ ప్రాంత అస్థిరత దాని ఆర్థిక ప్రయోజనాలను, ముఖ్యంగా పాకిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులు, భారత్‌తో సరిహద్దు వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని చైనా భావిస్తోంది.

పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేసింది. భద్రతా దళాలు లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM), ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లకు చెందిన అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!