తన కళ్ల ఎదురుగా శృంగారంలో పాల్గొనమని చెప్పి... దారుణ హత్య..!

By telugu news teamFirst Published Nov 23, 2022, 9:56 AM IST
Highlights

మొదట... దీనిని పోలీసులు పరువు హత్యగా భావించారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో... బంధువులే చంపేశారని అభిప్రాయాపడ్డారు. కానీ... దర్యాప్తులో ఓ తాంత్రికుడు  చంపినట్లు తేలడం గమనార్హం.

ఓ తాంత్రికుడు... తన వద్దకు వచ్చే ఇద్దరు వ్యక్తులను అతి దారుణంగా హత్య  చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న.. ఆ ఇద్దరిని తన కళ్ల ముందు శృంగారంలో పాల్గొనమని చెప్పి మరీ వారిని హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని కెలాబావాడీ అటవీ ప్రాంతంలో నవంబర్ 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఒకరు పురుషులు కాగా... మరొకరు స్త్రీ. వారిద్దరూ... నగ్నంగా పడి ఉండటం గమనార్హం. అప్పటికే వారు చనిపోయి... మూడు రోజులు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట... దీనిని పోలీసులు పరువు హత్యగా భావించారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో... బంధువులే చంపేశారని అభిప్రాయాపడ్డారు. కానీ... దర్యాప్తులో ఓ తాంత్రికుడు  చంపినట్లు తేలడం గమనార్హం.


మృతులను 30 ఏళ్ల టీచర్ రాహుల్ మీనా, 28 ఏళ్ల సోను కున్వర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్, సోనూ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. భదవి గూడలోని ఇచ్ఛాపూర్ణ శేషనాగ్ భావ్‌జీ మందిర్‌లో వారి కుటుంబాలు తరచూ తాంత్రికుడిని సందర్శించేవారు. ఈ సమయంలోనే... రాహుల్, సోనులకు పరిచయం ఏర్పడటం గమనార్హం.

అక్కడకు వస్తూ ఉండగా...పరిచయం ఏర్పడి... వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.  దాని కారణంగా రాహుల్ తన భార్యతో తరచుగా గొడవలు పడటం ప్రారంభించాడు.  అయితే... రాహుల్ భార్యకు... అతని వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో.... ఈ విషయంలో సహాయం చేయమని ఆమె... తాంత్రికుడిని కోరింది. అతను కూడా... వారి గురించి ఆమెకు తెలియజేయడం మొదలుపెట్టాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భలేష్ గత ఏడెనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటూ ప్రజలకు తాయత్తులు చేసేవాడు. తాంత్రికుడు స్వయంగా సోనూతో సన్నిహితంగా మెలిగాడు, దాని కారణంగా అతను రాహుల్, సోను మధ్య అక్రమ సంబంధం గురించి రాహుల్ భార్యకు తెలియజేశాడు.

 తాంత్రికుడు... తనకు సోను మధ్య ఉన్న సంబంధాల గురించి తన భార్యకు చెప్పాడని రాహుల్ కనుగొన్నాడు. దీంతో... రాహుల్.. అప్పటి నుంచి తాంత్రికుడిని బెదిరిస్తూ రావడం మొదలుపెట్టాడు. అతను ఫేక్ తాంత్రికుడు అని కేసు పెడతానని బెదిరించాడు. దీంతో... ఏళ్ల తరబడి తనకంటూ తాను సంపాదించుకున్న పరువు పోతుందేమోనన్న భయంతో తాంత్రికుడు వారిపై పగ తీర్చుకునేందుకు పథకం పన్నాడు.

తాంత్రికుడు దాదాపు 50 ట్యూబ్‌ల సూపర్‌గ్లూను కొనుగోలు చేసి ముందుగా సీసాలో పోశాడు. నవంబర్ 15వ తేదీ సాయంత్రం రాహుల్, సోనూలను ఓ అడవిలోని ఏకాంత ప్రాంతానికి ఆహ్వానించి తన ఎదుటే శృంగారంలో పాల్గొనాల్సిందిగా కోరాడు.

ఇద్దరూ కలయికలో పాల్గొన్న సమయంలో  తాంత్రికుడు ఫెవిక్విక్ బాటిల్‌ను వారిపై పోశాడు. వ్యక్తులు వారి మృతదేహాలను కనుగొన్నప్పుడు, వారు అభ్యంతరకరమైన స్థితిలో ఉంటారని, అతను సులభంగా తప్పించుకోవచ్చని అనుకున్నాడు.

తాంత్రికుడు వారిపై ఫెవిక్విక్‌ను పోయడంతో, రాహుల్, సోను చాలా సేపు ఒకరికొకరు అతుక్కుపోయారని పోలీసులు తెలిపారు. వాస్తవానికి, ఒకరినొకరు దూరం చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలలో, వారి చర్మం చిరిగిపోయిందని పోలీసులు తెలిపారు. రాహుల్ ప్రైవేట్ పార్ట్ అతని శరీరం నుండి వేరు చేసి కనిపించడం గమనార్హం.సోనూ ఆమె ప్రైవేట్ అవయవాలకు కూడా చాలా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తాంత్రికుడిని అరెస్టు చేసి... కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

click me!