ఆ వ్యక్తి ఆచూకీ చెబితే రూ. 10 లక్షలిస్తాం - ఎన్ఐఏ ప్రకటన.. ఇంతకీ ఎవరతను ?

Published : Mar 06, 2024, 04:28 PM IST
ఆ వ్యక్తి ఆచూకీ చెబితే రూ. 10 లక్షలిస్తాం - ఎన్ఐఏ ప్రకటన.. ఇంతకీ ఎవరతను ?

సారాంశం

రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన వ్యక్తిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. నిందితుడి ఫొటో ఇప్పటికే విడుదల చేసిన ఆ దర్యాప్తు సంస్థ.. అతడికి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి రూ.10 లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించింది.

బెంగళూరు కుందలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి నిందితులను పట్టుకునేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించడంతో ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. 

ముచ్చటగా మూడో సారి మోడీయే ప్రధాని.. ఎన్డీఏ కూటమికి 378 సీట్లు - ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్

కేఫ్ లో బాంబు పెట్టిన నిందితులను పట్టుకునేందుకు ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అనుమానిత బాంబర్ ఫొటోను ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా నిందితుడి అరెస్టుకు దారితీసే కీలక సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.

ఓటింగ్ సమయంలో వేలికి పూసే సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ? దాని ప్రత్యేకతలేంటంటే ?

ఈ కేసులో ప్రజల సహకారాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఎన్ఐఏ ఈ ప్రకటన చేసింది. అయితే నిందితులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించే వారి గుర్తింపును అత్యంత గోప్యంగా ఉంచుతామని కేంద్ర దర్యాప్తు సంస్థ హామీ ఇచ్చింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, కేసుకు త్వరగా, సులభంగా చేధించడానికి ఎన్ఐఏ ఈ ప్రయత్నం చేస్తోంది. 

నిందితులకు సంబంధించిన ఏ సమాచారం తెలిసినా.. ముందుకు వచ్చి తమ దర్యాప్తునకు సహకరించాలని ఎన్ఐఏ కోరింది. 08029510900 లేదా 8904241100 నెంబర్లకు కాల్ చేసి సాధారణ పౌరులెవరైనా అధికారులను సంప్రదించవచ్చిన పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu