ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరికాసేపట్లో మోదీ గన్నవరం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ షెడ్యూల్కు సంబంధించిన పూర్తి వివరాలు, మోదీ ఏం చేయనున్నారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు.
* హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.15 గంటలకు వెలగపూడి సభాస్థలికి చేరుకుంటారు.
* సాయంత్రం 4:55కి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. ప్రధాని మొత్తం 1 గంట 15 నిమిషాలు ఏపీలో ఉంటారు.
మొత్తం విలువ: రూ. 49,040 కోట్లు
నిర్మించబోయే భవనాలు:
కొత్త హైకోర్టు
సచివాలయం
శాసనసభ భవనం
న్యాయమూర్తుల నివాస సముదాయం
ఎమ్మెల్యేలు, మంత్రులు, IAS అధికారుల గృహ సముదాయాలు
రక్షణ, పరిశోధన & పరిశ్రమల విభాగాలు (DRDO, DPIIT): నాగాయలంక మిస్సైల్ టెస్ట్ రేంజ్ – రూ. 1,500 కోట్లు
విశాఖ యూనిటీ మాల్ – వర్చువల్ శంకుస్థాపన
గుంతకల్ వెస్ట్ - మల్లప్ప గేట్ రైల్వే లైన్ – రూ. 293 కోట్లు
ఖాజీపేట – విజయవాడ 3వ లైన్ – రూ. 254 కోట్లు
బుగ్గనపల్లి – పాణ్యం డబ్లింగ్ లైన్లు (గుంటూరు - గుంతకల్ ప్రాజెక్టులో భాగంగా)
హైవే, రవాణా ప్రాజెక్టులు (NHAI): నేషనల్ హైవే ప్రాజెక్టులు – రూ. 3,176 కోట్లు (వర్చువల్ శంకుస్థాపన), పలు NH పనులు ప్రారంభం – రూ. 3,680 కోట్లు