PM Modi: అమ‌రావ‌తిలో మోదీ ఏం చేయ‌నున్నారు.? పూర్తి వివ‌రాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. మ‌రికాసేప‌ట్లో మోదీ గ‌న్న‌వరం చేరుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు, మోదీ ఏం చేయ‌నున్నారు.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Google News Follow Us

ప్ర‌ధాని మోదీ అమ‌రావ‌తి టూర్ ముఖ్యంశాలు: 

* మ‌ధ్యాహ్నం 2.55 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. 

* హెలికాప్ట‌ర్‌లో మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల‌కు వెలగపూడి సభాస్థలికి చేరుకుంటారు. 

* సాయంత్రం 4:55కి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. ప్ర‌ధాని మొత్తం 1 గంట 15 నిమిషాలు ఏపీలో ఉంటారు. 

అమరావతి రాజధాని ప్రాజెక్టుల కోసం శంకుస్థాపన:

మొత్తం విలువ: రూ. 49,040 కోట్లు

నిర్మించబోయే భవనాలు:

కొత్త హైకోర్టు

సచివాలయం

శాసనసభ భవనం

న్యాయమూర్తుల నివాస సముదాయం

ఎమ్మెల్యేలు, మంత్రులు, IAS అధికారుల గృహ సముదాయాలు

కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభాలు/శంకుస్థాపనలు:

రక్షణ, పరిశోధన & పరిశ్రమల విభాగాలు (DRDO, DPIIT): నాగాయలంక మిస్సైల్ టెస్ట్ రేంజ్ – రూ. 1,500 కోట్లు

విశాఖ యూనిటీ మాల్ – వర్చువల్ శంకుస్థాపన

రైల్వే ప్రాజెక్టులు:

గుంతకల్ వెస్ట్ - మల్లప్ప గేట్ రైల్వే లైన్ – రూ. 293 కోట్లు

ఖాజీపేట – విజయవాడ 3వ లైన్ – రూ. 254 కోట్లు

బుగ్గనపల్లి – పాణ్యం డబ్లింగ్ లైన్లు (గుంటూరు - గుంతకల్ ప్రాజెక్టులో భాగంగా)

హైవే, రవాణా ప్రాజెక్టులు (NHAI): నేషనల్ హైవే ప్రాజెక్టులు – రూ. 3,176 కోట్లు (వర్చువల్ శంకుస్థాపన), పలు NH పనులు ప్రారంభం – రూ. 3,680 కోట్లు
 

Read more Articles on
click me!