స్టాలిన్, కనిమొళిలను ఓదార్చిన మోడీ.. కరుణకు నివాళి

Published : Aug 08, 2018, 10:47 AM ISTUpdated : Aug 08, 2018, 11:19 AM IST
స్టాలిన్, కనిమొళిలను ఓదార్చిన మోడీ.. కరుణకు నివాళి

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్రమోడీ నివాళుర్పించారు. కరుణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రధాని ఇవాళ వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్రమోడీ నివాళుర్పించారు. కరుణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రధాని ఇవాళ వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజాజీ హాల్‌కు చేరుకుని.. కరుణానిధికి శ్రద్ధాంజలి ఘటించారు.

తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న స్టాలిన్, కనిమొళిలను ఓదార్చి.. మిగిలిన కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకు ముందు  చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఘనస్వాగతం పలికారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !
జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi