ఎల్‌ఇటీ, ఐఎస్‌ఐఎస్, అల్-ఖైదాల్లో చేరాలని యువతను పీఎఫ్ఐ ప్రోత్సహించింది- ఎన్‌ఐఏ

Published : Sep 25, 2022, 04:27 PM IST
ఎల్‌ఇటీ, ఐఎస్‌ఐఎస్, అల్-ఖైదాల్లో చేరాలని యువతను పీఎఫ్ఐ ప్రోత్సహించింది- ఎన్‌ఐఏ

సారాంశం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సభ్యులు యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహించారని ఎన్ఐఏ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక నివేదికను విడుదల చేసింది. 

ఇటీవ‌ల అరెస్టయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి చెందిన 10 మంది నిందితులు లష్కరే తోయిబా (LeT), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS), అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు బలహీన యువతను ప్రోత్సహించారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తెలిపింది. ఈ మేర‌కు ఆ  ద‌ర్యాప్తు సంస్థ ఆదివారం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది.

జ‌మ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

హింసాత్మక జిహాద్‌లో భాగంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడడం ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి వారు కుట్ర‌ప‌న్నార‌ని చెప్పింది. కేరళలోని పీఎఫ్‌ఐ, ఆఫీస్ బేరర్లు, సభ్యులు, అనుబంధ సంస్థలు వివిధ మతాలు, సమూహాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించి, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగిస్తూ, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే ఉద్దేశంతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేశార‌ని పేర్కొంది.

ఆర్ఎస్ఎస్, బీజేపీలపై అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు.. గుజరాత్‌లో ఆయన ఏమన్నారో తెలుసా?

భారత్‌పై అసంతృప్తిని కలిగించడం, సాధారణ ప్రజలలో భయాందోళనలను కలిగించే క్రిమినల్ ఫోర్స్ వినియోగాన్ని సమర్థిస్తూ ప్రత్యామ్నాయ న్యాయ బట్వాడా వ్యవస్థను ప్రచారం చేయడం, లష్కరే తోయిబా (LeT), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ISIS) వంటి తీవ్రవాద సంస్థలో చేరడానికి యువకులను ప్రోత్సహించేందుకు ప్లాన్ చేశార‌ని తెలిపింది. 

గంజాయి తోట గుర్తించి పరిశీలించిన పోలీసు.. అధికారిపై దాడి చేసిన 40 మంది గంజాయి సాగుదారులు

‘‘ రాష్ట్రం, దాని యంత్రాంగంపై ద్వేషాన్ని సృష్టించడానికి నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ విధానాలను తప్పుడు వ్యాఖ్యానం చేయడం వల్ల PFI భారతదేశంపై అసంతృప్తిని కూడా వ్యాపింపజేస్తోంది ’’ అని నివేదిక తెలిపింది. 

చంఢీగ‌డ్ విమానాశ్ర‌యానికి భ‌గ‌త్ సింగ్ పేరు పెడుతాం - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

గత గురువారం ఎన్‌ఐఎతో పాటు ఈడీ, ఇతర ద‌ర్యాప్తు ఏజెన్సీలు పీఎఫ్‌ఐ ఆఫీసుల‌పై దాడి చేశాయి. ఈ సందర్భంగా పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న 106 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారికి శిక్షణ ఇవ్వడం, ఆయా సంస్థలో యువతను చేర్చుకోవడానికి ప్ర‌య‌త్నించార‌ని ద‌ర్యాప్తు ఏజెన్సీలు తెలిపాయి. ఒకే స‌మ‌యంలో ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాడులు కొన‌సాగాయి. ఈ సంద‌ర్భంగా ఏజెన్సీలు ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?