Operation Sindoor2: పాకిస్థాన్ పైల‌ట్‌ను స‌జీవంగా ప‌ట్టుకున్న భార‌త ఆర్మీ..

Published : May 08, 2025, 11:07 PM ISTUpdated : May 08, 2025, 11:12 PM IST
Operation Sindoor2: పాకిస్థాన్ పైల‌ట్‌ను స‌జీవంగా ప‌ట్టుకున్న భార‌త ఆర్మీ..

సారాంశం

పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీకారంగా భార‌త్‌పై దాడుల‌కు దిగుతోంది. ఇందులో భాగంగానే జ‌మ్ముపై దాడి చేసింది.   

రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో భారత భద్రతా బలగాలు ఓ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి, ఆ విమానానికి చెందిన పైలట్‌ను సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.

భారత గగనతలాన్ని దాటి దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానం, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన భారత వాయుసేన, ప్రతిస్పందనగా యుద్ధ విమానాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఆ విమానం భారత భూభాగంలోని జైసల్మేర్ ప్రాంతంలో కూలిపోయింది.

విమానంలోని పైలట్ సజీవంగా పట్టుబడటం పాక్‌కు పెద్ద దెబ్బగా మారనుంది. భారత్ ఇప్పటికే పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి పలు కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu