తీరుమారని పాకిస్తాన్.. వరుసగా ఐదో రోజూ కాల్పులు

Published : Apr 29, 2025, 08:54 AM ISTUpdated : Apr 29, 2025, 08:55 AM IST
తీరుమారని పాకిస్తాన్.. వరుసగా ఐదో రోజూ కాల్పులు

సారాంశం

పాకిస్తాన్ వరుసగా ఐదో రోజు కూడా కాల్పుల విరమణ ఉల్లంఘించింది. పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి, దీనికి తోడు పాకిస్తాన్ కాల్పుల ఘటనలు కూడా పెరిగాయి.

పహల్గాం దాడి: పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో వరుసగా ఐదో రోజు కూడా  కాల్పుల విరమణ ఒప్పందాన్ని  ఉల్లంఘించింది. సోమవారం రాత్రి పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటించింది.

కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్‌లో కూడా కాల్పులు జరిగాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది. 

ఇటీవలి కాల్పుల విరమణ ఉల్లంఘనలు 

ఏప్రిల్ 1: కృష్ణా లోయ సెక్టార్‌లో మైన్ బ్లాస్ట్ జరిగింది. దీని ఉద్దేశ్యం చొరబాటును ప్రోత్సహించడం. ఆ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు.

ఏప్రిల్ 22-23: పహల్గాం ఉగ్రదాడి రాత్రి పూంచ్ జిల్లాలో సరిహద్దులో కాల్పులు జరిగాయి.

ఏప్రిల్ 24-25: అర్ధరాత్రి కుప్వారా జిల్లాలో సరిహద్దు దాటి కాల్పులు జరిగాయి.

ఏప్రిల్ 25-26: నియంత్రణ రేఖ వెంబడి 34 ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి.

ఏప్రిల్ 26-27: కుప్వారా జిల్లాలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించిన రెండు సంఘటనలు జరిగాయి.

ఏప్రిల్ 28: సోమవారం రాత్రి పాకిస్తాన్ సైనిక స్థావరాలు నియంత్రణ రేఖ దాటి పూంచ్ జిల్లా సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై తీసుకున్న చర్యలు

ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేశారు. దీంతో 26 మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది, దౌత్య కార్యాలయాల పరిమాణాన్ని తగ్గించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu