ఆ నగరంలో హై అలర్ట్.. నిమజ్జనంలో బాంబులు పేలుస్తామంటూ పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల హెచ్చరిక.

Published : Sep 05, 2025, 01:24 PM IST
High Alert In mumbai (Representative image)

సారాంశం

నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో బాంబుల‌తో దాడి చేస్తామంటూ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఓ బెదిరింపు సందేశం వ‌చ్చింది. ఇంత‌కీ ఆ న‌గ‌రం ఏంటి.? ఎలాంటి బెదిరింపుల‌కు దిగారంటే. 

ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం ఓ బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మెసేజ్‌ "లష్కరే-జిహాదీ" అనే ఉగ్రవాద సంస్థ పేరుతో పంపించారు. నగరంలో 34 వాహనాల్లో 34 హ్యూమన్ బాంబులు పెట్టారని, 400 కిలోల RDXతో భారీ పేలుళ్లు జ‌ర‌గ‌నున్నాయంటూ స‌ద‌రు సందేశంలో పేర్కొన్నారు.

14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని కూడా ఆ సందేశంలో ఉంది. ఈ దాడులు గణేశ్ నిమజ్జన సందర్భంగా జరుగుతాయని మెసేజ్‌లో రాసి ఉంది.

పోలీసులు ఏమంటున్నారు?

ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కి ఈ మెసేజ్ వచ్చింది. సందేశం ఎంతవరకు నిజమో అన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మెసేజ్ పంపినవారు పాకిస్తాన్‌ ఆధారిత ఉగ్రవాద సంస్థకు చెందినవారని పేర్కొనడంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !