ఉన్నత విద్యారంగంలో ప్రతిష్టంభనను సృష్టించేందుకే కేరళ గవర్నర్ ప్రయత్నాలు - మంత్రి ఆర్ బిందు

Published : Oct 25, 2022, 12:53 PM IST
ఉన్నత విద్యారంగంలో ప్రతిష్టంభనను సృష్టించేందుకే కేరళ గవర్నర్ ప్రయత్నాలు - మంత్రి ఆర్ బిందు

సారాంశం

ఉన్నత విద్యా రంగంలో ప్రతిష్టంభనను సృష్టించేందుకే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు ఆరోపించారు. గవర్నర్ ప్రభుత్వ పనిలో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు.

కేరళ పాలక వామపక్ష ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని కోరుతూ ఉత్తర్వు జారీ చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్ర మలుపు తిరిగింది. సోమవారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో కేరళ గవర్నర్ కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌లను రాజీనామా చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజ్‌భవన్‌ పీఆర్‌వో తెలిపారు.

నిన్ను చూసి గర్వపడుతున్నాం.. : బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ గెలుపుపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

అక్టోబర్ 24, 2022 ఉదయం 11:30 గంటలలోపు తమ రాజీనామాను సమర్పించాలని కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఆదేశిస్తూ లేఖలు జారీ అయ్యాయి. సంబంధిత వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లకు లేఖలు ఈమెయిల్‌లో ద్వారా అందాయి. కాగా.. ఈ లేఖపై కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. గవర్నర్ తీరును తప్పుబట్టారు. ఆయన నిర్ణయాన్ని ఖండించారు. దేశంలో ఏ ఇతర గవర్నర్ అయినా ఇలాంటి చర్యలు చేపట్టారా అని ప్రశ్నించారు.

దారుణం.. గాజు సీసాలో టపాకాయలు కాల్చొద్దని చెప్పినందుకు యువకుడిని హతమార్చిన ముగ్గురు మైనర్లు.. ఎక్కడంటే ?

ఉన్నత విద్యారంగంలో ప్రతిష్టంభనను సృష్టించేందుకే ఈ ప్రయత్నమని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదని అన్నారు. ‘‘ ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నర్‌ అయినా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారా? ఇది బాధాకరమైన పరిస్థితి. ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా దీనిని చూడొచ్చు. ఉన్నత విద్యా రంగంలో మన విశ్వవిద్యాలయాలు అసాధారణ విజయాలు సాధిస్తున్నాయి. ’’ అని ఆమె అన్నారు.

మఠంలో స్వామీజీ అనుమానాస్పద మృతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ సూసైడ్ లెటర్ ?

గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వైస్ ఛాన్సలర్లు చాలా బాగా పని చేస్తున్నారని అన్నారు. వారి హయాంలో విశ్వవిద్యాలయాలు బాగా పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. “ఈ వీసీల నాయకత్వంలో కేరళ యూనివర్సిటీకి A++, కాలికట్, కలాడి, కుశాట్ యూనివర్సిటీలు A+ పొందాయి” అని మంత్రి ఆర్ బిందు అన్నారు. 

కోయంబత్తూరు కారు పేలుడు: ఐదుగురు అరెస్ట్

మరోవైపు న్నూర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ రాజీనామాను సమర్పించేందుకు నిరాకరించారు. ‘‘ కేరళ గవర్నర్ నిర్ణయాన్ని నేను స్వీకరించాను, కానీ నేను నా రాజీనామాను సమర్పించను. ఆర్థిక అవకతవకలు, దుష్ప్రవర్తన ఉంటే ఇలా రాజీనామా చేయాలని కోరాలి. కానీ ఆ రెండు ఇక్కడ జరగలేదు. ’’ అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu